జానపద వచన కథ - వైశిష్ట్యం
Author(s): డాII వి.నారాయణప్ప
Abstract: జానపద సాహిత్యం అనేది జానపద విజ్ఞానంలో ఒక భాగం. ఈ జానపద సాహిత్య విభాగంలో జానపద గేయాలు, కథాగేయాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు చేరుతాయి. జానపద విజ్ఞానంలోని ప్రతి అంశాన్ని వర్ణించుటకు, ప్రబోధించుటకు సాహిత్యం ఒక సాధనంగా ఉపకరిస్తుంది. మానవుని బుద్ధి ఆలోచించడానికి మొదలు పెట్టినప్పటి నుండే కథాకథనం ప్రారంభమైంది. మన భరతఖండంలో ప్రాచీన మహర్షులు కథల రూపంలో తమ శిష్యులకు ధార్మిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలను బోధిస్తూ, విజ్ఞానాన్ని తరతరాలకు అందిస్తూ వచ్చారు. లిఖిత సాహిత్యంలోని కథలు, మౌఖిక సాహిత్యంలోని కథలు కొన్ని వేరు వేరు లక్షణాలు కలిగి ఉంటాయి. జానపద వచన కథలను ఎందురో పండితులు ఎన్నో విధాలుగా వర్గీకరించారు. ప్రపంచ జానపద వచన కథా సాహిత్యం మీద సమగ్రమైన అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనాల ఆధారంగా జానపద కథల లక్ష్య-లక్షణాలను, జానపద కథకుని లక్షణాలను, జానపద శ్రోత లక్షణాలను ఈ పరిశీలన వ్యాసంలో వివరించాను చూడవచ్చు.
Pages: 262-267 | Views: 86 | Downloads: 52Download Full Article: Click HereHow to cite this article:
డాII వి.నారాయణప్ప. జానపద వచన కథ - వైశిష్ట్యం. Int J Multidiscip Trends 2022;4(1):262-267.